Wednesday, 10 November 2021

నా మాట - ఒక స్వప్నం కోసం

అందరికీ నమస్కారములు!
నా పేరు గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాద్ .. "గరిమెళ్ళ గమనాలు" అను నా కలం పేరుతో మీ అందరికీ సుపరిచయమే అని భావిస్తున్నాను. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక నా స్వప్నం నేడు నా కవితా సంపుటి రూపంలో ఆవిష్కారం అవుతుంది., మాది ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా  జిల్లాలోని కేసరపల్లి అను గ్రామం నా స్వస్థలం .వృత్తి రీత్యా కొన్ని సంవత్సరాలుగా  హైదరాబాద్ లో సెటిల్ అయ్యినాను. మా నాన్న గారి పేరు కీ. శే. సాంబశివరావు గారు అమ్మ పేరు పద్మావతి .నాన్నగారు పిన్న వయస్సులోనే కాలం చేయటం వలన అమ్మ ప్రేమలో గారాబంగా పెరిగాను.అమ్మ చేపట్టిన బాధ్యతలో నేను కూడా ఒక క్రమశిక్షణ గానే ,నా మేనమామ "దేవళ్ళ శ్రీనివాసరావు" ఆధ్వర్యంలో నా విద్యాభ్యాసం కొనసాగించాను. చిన్నప్పటి నుంచి పుస్తక పరిజ్ఞానం కొంచెం ఉండటం చేత నాకు తోచినట్టు గా, తెలియని వాటి గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస తో తెలుసుకుంటూ నన్ను నేను చదువుకుంటూ ఎదిగాను. నేను చిన్నప్పుడు కవి అంటే తెలియని వారిని చూసాను ,ఎగతాళి చేసిన వారిని చూసాను అసలు ఆ పదం అంటే ఏంటో పూర్తిగా అవగాహన లేని స్థానం నాది. నాకు నేను పాటల రూపంలో, కథల రూపంలో రాసుకుంటూ చెప్పుకుంటూ వచ్చేవాడిని.  కవి అంటే ఏంటో తెలియని స్థాయి నుంచి నేడు కవులును కోకొల్లలుగా చూడగలగడం వారిలో నేను ఒక   కవిగా మారి నేడు నా కవితా సంపుటి విడుచల చేసే స్థాయి కి రావటం చాలా సంతోషంగా ఉంది .చిన్నప్పుడు తరచుగా చదువుకున్నది "మాతృ దేవో భవ, పితృ దేవో భవ,ఆచార్య దేవో భవ, అతిధి దేవభవ"  కాబట్టి ముందుగా నాకు జన్మ అందించినందుకు మా తల్లి తండ్రులకు పాదాభివందనాల తో నమస్సులు అలానే నాకు సకల విద్యాబుద్దులు నేర్పించి నేను జీవితంలో రానించుటకు కృషి చేసిన నా గురువులు " శ్రీ నాదెండ్ల లక్ష్మణ్ రావు గారు" & శ్రీ తిరుపతి రెడ్డి గార్లకు " నా హృదయపూర్వక నమస్సులు తెలియజేసుకుంటున్నాను.  
మాది ఒక సాధారణ రైతు కుటుంబం. మా  నా చిన్నతనంలోనే మా నాన్నగారిని కోల్పోయాను. మా అమ్మమ్మ గారింట్లో ,మా మేనమామ గారి ఆధ్వర్యంలో నా విద్యాభ్యాసం కంప్లీట్ చేసాను. అమ్మంటే బాధ్యతగా , అమ్మనే దేవతగా భావించి, అమ్మ చెప్పిన మాటతో నా జీవితానికి బాట వేసుకుని మంచి విజయవంతంగా నే జీవిస్తున్నా అని చెప్పవచ్చు. మా కుటుంబ నేపథ్యంలో ఎవరూ కవులు/కవయిత్రులు గాని లేరు.చిన్నప్పటి నుంచి చదువుతో పాటు, పుస్తక పఠనాలు, పేపర్లో వచ్చే ఆర్టికల్స్ ని ఇంట్రెస్ట గా చదివి ఫాలో అవుతూ ,నాలో కూడా రచించే శక్తి ఉందని తెలుసుకున్నాను. నా ప్రథమ కవిత "జన్మభూమి" నా తొమ్మిదో తరగతిలో వక్తృత్వ పోటీలు చదివి ఫస్ట్ ప్రైజ్ కూడా గెలుచుకున్నాను.అలానే నేను రాసిన మొదటి కథలు "రాక్షసి బల్లి" & ఎగ్జిబిషన్" అలా అలా ఇంటర్లో ,డిగ్రీలో కొన్ని కొన్ని కవితలు రాయటం వాటిని పదిలపరుచుకోవటం, స్నేహితులకు ,బంధువులకు చదివి వినిపించడం చేస్తూ ఉండేవాడిని .అయితే నేను ఎక్కువగా ఆసక్తి చూపి ,కవిగా గుర్తింపు తెచ్చుకుంది మాత్రం "ఫేస్ బుక్" ద్వారానే. నాకు ఫేస్ బుక్ లో కవిగా గుర్తింపు వచ్చిన ,కవితలు నా శైలిలో నేను రాయటానికి అవకాశం ఇచ్చిన "మన తెలుగు మన సంస్కృతి" గ్రూప్ మరియు "సాహితీ సేవ" గ్రూప్ ల అడ్మిన్స్ శ్రీ మీగడ త్రినాథ్ , శ్రీమతి మంజు యనమదల గారు, శ్రీ కంచర్ల సుబ్బారాయుడు గారు, శ్రీమత్సి వడ్డే సిరి గార్లకు వారికి నా కృతజ్ఞత లు తెలియ చేసుకుంటున్నాను.అలానే నాకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తూ, సమయానికి సలహాలు సూచనలను అందజేస్తూ ,వారు నిర్వహించే కవి సమ్మేళనాలు,సభల లో నాకు ముఖ్య పాత్రను కనబరిచి ,బాధ్యతలు ఇచ్చి నన్ను ముందుకు నడిపిన శ్రీ కత్తి మండ ప్రతాప్ గారు నేడు వారు ప్రపంచ ప్రఖ్యాత గాంచిన కవి మిత్రులు, కవి సార్వభౌములు నాకోసం నేడు వారి విలువైన సమయాన్ని వెచ్చించి నా కవితా సంపుటి వారి మాటను జతకలిపి మరింత ఆనందాన్ని అందించిన వారికి అభిమానంతో హృదయ పూర్వక కృతజ్ఞతలు తెియజేస్తున్నాను. ఈ కాల గమనంలో ఎవ్వరితో ,ఎప్పుడూ ఎలా బందం ముడిపడుతుందో ఎవరికీ తెలియదు నాకు కూడా అలానే అనుకోని అతిథిలా పరిచయం అయ్యి ,నేడు నాకు సాహిత్య ప్రకారంగా అండంగా, అన్నగా నిలబడి